YS Sunitha Reddy: క‌ల్వ‌కుంట్ల క‌విత ఫోన్లు ఇచ్చారుగా..!

YS Sunitha Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో భాగంగా ఆయ‌న కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌ధాన నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) ప్రెస్ మీట్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని.. త‌నను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థంకావ‌డంలేద‌ని అవినాష్ అన్నారు. దీనిపై సునీతా రెడ్డి కౌంట‌ర్ వేసారు.

అవినాష్ త‌ప్పు లేద‌ని అన్ని ర‌కాల ఆధారాలు ఫోన్‌లో ఉన్న‌ట్లైతే.. ఆయ‌న ఆ ఫోన్ల‌ను సీబీఐకి ఇవ్వ‌చ్చు క‌దా అని సునీతా ప్ర‌శ్నించారు. ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అరెస్ట్ అయిన భార‌త రాష్ట్ర స‌మితి ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా త‌న త‌ప్పు లేద‌ని చెప్ప‌డానికి ఎన్నో సెల్‌ఫోన్ల‌ను క‌వ‌రులో పెట్టి అధికారుల‌కు అప్ప‌గించార‌ని.. అదే విధంగా అవినాష్ రెడ్డి ఎందుకు త‌న ఫోన్ల‌ను సీబీఐకి ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. వివేకా, రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆశీస్సుల‌తో అవినాష్‌కు ఓటేస్తార‌ని అంటున్నార‌ని.. ఆ మాట అవినాష్ నోటి నుంచి రావ‌డం చాలా కష్టంగా అనిపించింద‌ని అన్నారు.

ఇలాంటి మ‌రిన్ని వార్త‌లు చ‌ద‌వడానికి చూడండి https://telugu.newsx.com/