YS Sharmila: జగన్‌ చంద్రబాబు దొందు దొందే

YS Sharmila says chandrababu naidu and jagan are same

YS Sharmila: లిక్కర్ విషయంలో జగన్‌కి, చంద్రబాబుకి పెద్ద తేడా లేదని మండిప‌డ్డారు APCC  చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌. వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలను అమాంతం పెంచేసి లిక్కర్ మాఫియాను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని… జగన్ హయాంలో కేవలం క్యాష్ ద్వారానే నాసిరకం మద్యం అమ్మి దోచుకున్న వేల కోట్ల రూపాయలు ఎటు పోయాయో తెలియదని అన్నారు. జగన్ పాలనలో లిక్కర్ మాఫియా అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడిస్తే.. బాబు పాలనలో నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ల చేతుల్లో లిక్కర్ మాఫియా నడుస్తోందని విమ‌ర్శించారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదని… ఇద్ద‌రూ మాఫియా డాన్‌లే.. దొందు దొందే అని సెటైర్ వేసారు.