VK Naresh: ప‌వ‌న్‌లో ఏపీ భ‌విష్య‌త్తు క‌నిపిస్తోంది

VK Naresh: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని (Pawan Kalyan) చూస్తుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తు క‌నిపిస్తోంద‌ని అన్నారు ప్ర‌ముఖ న‌టుడు న‌రేష్‌. కొంత‌కాలంగా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల (AP Elections) విష‌యంపై సెటైర్లు వేస్తూ త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిన్న స‌భ‌లో మాట్లాడుతూ.. కృష్ణ‌ను కించ‌ప‌రిచార‌ని.. ఆయ‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎన‌లేని సేవ చేసార‌ని.. ఆయ‌న ఎప్పుడూ కూడా పొత్తులు మార్చి వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రిపైనా దూష‌ణ‌లు చేయ‌లేద‌ని న‌రేష్ అన్నారు. అంత‌టి మ‌హానుభావుడి గురించి ప‌వ‌న్ త‌ప్పుగా మాట్లాడ‌టం బాధ క‌లిగించింద‌ని అన్నారు.

ఈ నేప‌థ్యంలో న‌రేష్ ఓ ట్వీట్ చేసారు. “” ద‌య‌చేసి కృష్ణ గారి పేరు వాడి త‌ప్పుగా ట్వీట్స్ చేయ‌కండి. నాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఎంతో అభిమానం ఉంది. ప‌వ‌న్‌లో నాకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తు క‌నిపిస్తోంది. మాజీ భార‌తీయ జ‌న‌తా పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో గెలిచి రాష్ట్రానికి పునర్వైభ‌వం తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ “” అని ట్వీట్ చేసారు.

ALSO READ

పోల్ స‌ర్వేల‌ను భావ‌ప్రాప్తితో పోలుస్తూ న‌రేష్ కామెంట్

VK Naresh: నేతలు సుర‌క్షితంగా అసెంబ్లీకి వెళ్లాల‌ని కోరుకుంటున్నా