Vijaya Sai Reddy: పురంధేశ్వ‌రి విష‌యాలు బ‌య‌ట‌పెడితే ఆమె ఏమ‌న్నా చేసుకోవ‌చ్చు!

BJP నేత ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి (daggubati purandeswari) త‌న గురించి మిథున్ రెడ్డి గురించి లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు YSRCP ఎంపీ విజ‌య సాయి రెడ్డి (vijaya sai reddy). ఏపీ లిక్క‌ర్ కేసులో పురంధేశ్వ‌రి ఎవ‌రెవ‌రికి టెండర్లు ఇచ్చారో బ‌య‌పెట్టాల‌ని.. లిక్క‌ర్ షాపుల యాజమాన్యం పేర్లు బ‌య‌ట‌పెట్టాల‌ని కొంతకాలంగా YSRCP పార్టీ స‌వాల్ విసురుతున్నారు.

దీనిపై విజ‌య సాయిరెడ్డి స్పందిస్తూ.. అస‌లు ఒక నియోజ‌క‌వ‌ర్గం అనేదే లేని నాయ‌కురాలు త‌మ‌పై లేని పోని ఆరోప‌ణ‌లు చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని ఆధారాలు ఉంటే చూపించి అప్పుడు మాట్లాడాల‌ని అన్నారు. పురంధేశ్వ‌రి త‌న కుటుంబం గురించి BJPలో చేరారే త‌ప్ప ఏనాడూ పార్టీ ప్ర‌యోజ‌నం కోసం ప‌నిచేయ‌లేద‌ని అన్నారు. పురంధేశ్వ‌రి గురించి త‌న‌కు తెలిసిన విష‌యాలు బ‌య‌ట‌పెడితే ఆమె ఏమైనా చేసుకుంటారేమో అన్న భ‌యంతో ఇప్పుడు త‌క్కువ‌గా మాట్లాడుతున్నాన‌ని తెలిపారు. మ‌ళ్లీ ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే అప్పుడు అన్ని విష‌యాలు బ‌య‌ట‌పెట్టాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు.