Uttam: మేడిగ‌డ్డ‌పై మ‌ర‌మ్మతులు ఎవ‌డు చేయ‌మ‌న్నాడు?

Uttam Kumar Reddy: మేడిగడ్డ బ్యారేజ్‌పై మ‌రమ్మ‌తులు ఎవడు చేయ‌మ‌న్నాడంటూ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. అయ్యర్ కమిటీ సిఫార్సులు వ‌చ్చాకే రిపేర్లు చెయ్యాలని అన్నారు. బ్యారేజ్ మరమ్మత్తుల కోసం నిర్మాణ సంస్థ ఎల్ & టీ సంస్థతో ఇటీవల నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ అనిల్ కుమార్ చర్చలు జ‌రిపారు. ఈ విష‌యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలీడంతో ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ప్రభుత్వ అనుమతి లేకుండా, పాలసీకి విరుద్ధంగా మరమ్మత్తులు ఎలా చేస్తారంటూ ఆయ‌న అధికారుల‌ను ప్ర‌శ్నించారు.

ALSO READ:

Telangana: రుణ మాఫీపై మాట మార్చిన కాంగ్రెస్

Rythu Bandhu: వారికి రాదు.. కొత్త రూల్స్ ఇవే

Telangana: ఉచిత బ‌స్సు ప్ర‌యాణం తొల‌గించ‌నున్న ప్ర‌భుత్వం?