Thota Trimurthulu: 28 ఏళ్ల విచార‌ణ‌.. 148 వాయిదాలు.. 18 నెల‌ల జైలు శిక్ష‌!

28 ఏళ్ల సుదీర్ఘ విచార‌ణ‌

1996 డిసెంబ‌ర్‌లో ఇప్ప‌టి కోన‌సీమ జిల్లాలోని రామ‌చంద్రాపురంలో ఈ శిరోముండ‌నం ఘ‌ట‌న చోటుచేసుకుంది. తోట త్రిమూర్తులు ఐదుగురు దళితుల‌ను హింసించి వారికి శిరోముండ‌నం చేసాడు. దాంతో ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదైంది. దాదాపు 28 ఏళ్ల పాటు ఈ కేసు విచార‌ణ సాగింది.

148 వాయిదాలు

ఈ కేసును అటు తిప్పి ఇటు త‌ప్పి ఏకంగా 148 సార్లు వాయిదా వేసారు. దాంతో ఈ కేసు 28 ఏళ్ల పాటు కొన‌సాగింది. న్యాయ‌మూర్తులు ఈ కేసుకు సంబంధించి భ‌య‌ప‌డి నాట్ బిఫోర్ మి అని చెప్పి వ‌దిలేసేవార‌ట‌. ఈ కేసులో భాగంగా మ‌రో ఐదుగురిని కోర్టు దోషులుగా తేల్చి వారికి కూడా శిక్ష విధించింది.

ఇలాంటి మ‌రిన్ని వార్త‌లు చ‌ద‌వడానికి చూడండి https://telugu.newsx.com/