TDP: చంద్ర‌బాబుని శ్రీకృష్ణుడితో పోలుస్తూ ట్వీట్..!

వినాయ‌క చ‌వితి రోజున తెలుగు దేశం పార్టీ.. (tdp) త‌మ అధినేత చంద్ర‌బాబు నాయుడుని (chandrababu naidu) ఉద్దేశించి చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. జైలులో ఉన్న చంద్ర‌బాబుని శ్రీకృష్ణుడితో పోలుస్తూ ట్వీట్ చేసారు. “‘ ఆనాడు శ్రీకృష్ణుడు శ‌మంత‌క‌మ‌ణిని దొంగిలించాడ‌ని నీలాప నింద‌లు ఎదుర్కొన్నాడు. శ్రీ వినాయ‌క వ్ర‌త‌క‌ల్పం వ‌ల్ల నిర్దోషిగా నిరూపించ‌బ‌డ్డాడు. నేడు చంద్ర‌బాబు ఎదుర్కొంటున్న నింద‌లు కూడా తొలిగిపోయి వినాయ‌కుడి చ‌ల్ల‌ని చూపుల‌తో నిర్దోషిగా నిరూపితం అవ్వాల‌ని కోరుకుందాం “” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.