RK Roja: ప‌వ‌న్‌కి నిజం తెలుసు.. అందుకే ప్రాయ‌శ్చిత్త దీక్ష‌

rk on tirumala laddoo

RK Roja: తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు కావాల‌నే జ‌గన్ మోహ‌న్ రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్నార‌ని అన్నారు ఆర్కే రోజా. జ‌గ‌న్ ప‌రిపాల‌న‌లో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, న‌రేంద్ర మోదీ, అమిత్ షాల‌తో పాటు మాజీ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, ప్ర‌స్తుత ప్రధాన న్యాయ‌మూర్తులు కూడా ఎన్నోసార్లు శ్రీవారిని ద‌ర్శించుకున్నార‌ని.. ల‌డ్డూలో క‌ల్తీ జరిగి ఉంటే మ‌రి అప్పుడు తెలీలేదా అని ప్ర‌శ్నించారు. శ్రీవారిని అడ్డుపెట్టుకుని అస‌హ్య‌పు రాజ‌కీయాల‌కు పాల్పడితే తిరుప‌తి అమ్మాయిగా తాను చూస్తూ ఊరుకోన‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నార‌ని.. ప్రాయ‌శ్చిత్త దీక్ష త‌ప్పు చేసిన వారే చేస్తార‌ని అన్నారు. చంద్ర‌బాబు నాయుడు శ్రీవారి పేరుతో త‌ప్పు చేస్తున్నార‌న్న విష‌యం ప‌వ‌న్‌కి తెలుసు కాబ‌ట్టే త‌న‌కు ఈ పాపం త‌గ‌ల‌కూడ‌ద‌న్న కార‌ణంతో ప్రాయ‌శ్చిత్త దీక్ష చేస్తున్నార‌ని అన్నారు.