Congress: మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీనే అంటూ పోస్ట‌ర్ల క‌ల‌క‌లం

Congress: నిజామాబాద్, బోధన్‌లో పోస్టర్లు క‌ల‌క‌లం రేపాయి. రాహుల్ గాంధీ బోధన్ రాకను నిరసిస్తూ పోస్ట‌ర్లు వెలిసాయి. “”  బలిదానాల బాధ్యత కాంగ్రెస్ పార్టీదే… మా బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీనే.. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే… ముక్కు నేలకు రాయాల్సిందే “” అని పోస్ట‌ర్లపై డిమాండ్ చేస్తూ పోస్టర్లలో కర్నాటకలో కరెంటు కష్టాలు, నిరుద్యోగాన్ని ఎండగట్టారు.