Krishna SP: థ్రెట్ ఉంటే ప‌వ‌న్ మాకెందుకు ఫిర్యాదు చేయ‌లేదు?

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) త‌న‌కు తన జ‌న‌సైనికుల‌కు థ్రెట్ ఉంద‌ని చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. ఈ నేప‌థ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ (krishna sp) జాషువా (jashuva) ప్రెస్ మీట్ పెట్టారు. ఏ ర‌క‌మైన థ్రెట్ ఉందో త‌మ‌కు చెప్తే క్షేత్ర స్థాయిలో యాక్ష‌న్ తీసుకుని ర‌క్ష‌ణ క‌ల్పిస్తాం క‌దా అని ప్ర‌శ్నించారు. ఇలా ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే ప్ర‌జ‌ల‌కు పోలీసుల‌పై ఉన్న న‌మ్మ‌కం పోతుంద‌ని అన్నారు. ఇప్ప‌టికైతే ప‌వ‌న్‌కు నోటీసులు పంపించామ‌ని అన్నారు. కానీ త‌మ‌కు ఆ నోటీసులకు ఎలాంటి స‌మాధానం రాలేద‌ని మున్ముందు ఇలా నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తే ఎలాంటి బేస్ లేకుండా తమ‌కు కూడా అదుపులోకి తీసుకునే అధికారం ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.