KA Paul: 10 ల‌క్ష‌ల ఓట్లు నాకే ప‌డ్డాయ్.. నేనే వైజాగ్ ఎంపీ

KA Paul says 10 lakh people voted for him in vizag

KA Paul: ప్ర‌జాశాంతి పార్టీ అధినేత‌ కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వైజాగ్ నుంచి పోటీ చేసిన కేఏ పాల్.. నిన్న జ‌రిగిన పోలింగ్‌లో 10 ల‌క్ష‌ల ఓట్లు త‌న‌కే ప‌డ్డాయ‌ని అన్నారు. వైజాగ్‌లో మొత్తం 14 ల‌క్ష‌ల ఓట‌ర్ల ఉన్నార‌ని.. వాటిలో 10 ల‌క్ష‌ల ఓట్లు త‌నకే ప‌డ్డాయ‌ని తెలిపారు. కాబ‌ట్టి తానే వైజాగ్ ఎంపీగా గెలిచాన‌ని.. రేప‌టి నుంచే విశాఖ ఎంపీగా ప‌నులు స్టార్ట్ చేస్తాన‌ని పేర్కొన్నారు.