Kalyana Lakshmi ప‌థ‌కం వారికి వ‌ర్తించ‌దు

Kalyana Lakshmi: తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల్లో క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కం ఒక‌టి. ఇది ఎప్ప‌టినుంచి అమ‌లు అవుతుంది అన్న అంశంపై ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి (jeevan reddy) క్లారిటీ ఇచ్చారు. పెళ్లి చేసుకున్న‌వారందికీ ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. ప‌థ‌కం కింద రూ.1 ల‌క్ష న‌గ‌దు, తులం బంగారం ఇస్తామ‌ని అన్నారు. అయితే తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన తేదీ డిసెంబ‌ర్ 7. అంటే డిసెంబ‌ర్ 7 త‌ర్వాత పెళ్లి చేసుకున్న‌వారికే ఈ క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థకం వ‌ర్తిస్తుంద‌ని జీవ‌న్ రెడ్డి అన్నారు.