Janasena: జ‌గ‌న్ గెలిస్తే తిరుప‌తి నుంచి వైజాగ్ వ‌ర‌కు పోస్ట‌ర్లు వేయిస్తా

janasena kiran royal challenge to ysrcp

Janasena:  ఈసారి ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గెలిస్తే తాను తిరుప‌తి నుంచి వైజాగ్ వ‌ర‌కు జ‌గ‌న్ పోస్ట‌ర్లు వేయిస్తాన‌ని అన్నారు జ‌న‌సేన నేత కిర‌ణ్ రాయ‌ల్. ఈసారి నూటికి నూరు శాతం గెల‌వ‌బోయేది కూట‌మే అని.. అలా కాకుండా మ‌ళ్లీ జ‌గ‌న్ గెలిస్తే తాను శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డ‌మే కాకుండా జ‌గ‌న్ కోసం త‌న సొంత డ‌బ్బుల‌తో పోస్ట‌ర్లు వేయిస్తాన‌ని అన్నారు. ఈరోజు ప్ర‌తిప‌క్ష హోదాలో ఉండి తాను ప్రెస్ మీట్ పెట్టాన‌ని.. జూన్ 4న అధికార హోదాలో ప్రెస్ మీట్ పెడ‌తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు.