EXCLUSIVE: జ‌గ‌న్‌ను క‌లిసాక ఏడ్చుకుంటూ వెళ్లిన ఎస్సీ ఎమ్మెల్యే

EXCLUSIVE: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గన్ మోహ‌న్ రెడ్డిని (jagan mohan reddy) కలిసాక సింగ‌న‌మ‌ల‌ ఎస్సీ ఎమ్మెల్యే అయిన ప‌ద్మావ‌తి ఏడ్చుకుంటూ వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ ఆమెను నోటికొచ్చిన‌ట్లు తిట్టి పంపించార‌ట. ఎస్సీ నేత‌లు అణిగి మ‌ణిగి ఉండాల‌ని.. కుద‌ర‌క‌పోతే వారి కాళ్లు వీరి కాళ్లు ప‌ట్టుకోవాల్సిందేన‌ని గురించి ప్ర‌తికూలంగా ప‌ద్మావ‌తి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసారు. ఆ వీడియోపై నేత‌లు ఆమెపై మండిప‌డ్డారు. ఈ విష‌యాన్ని జ‌గ‌న్‌కు చేర‌వేసి పిలిచి క్లాస్ పీకాల‌ని చెప్పార‌ట‌. దాంతో ప‌ద్మావ‌తికి జ‌గ‌న్ నుంచి పిలుపు వ‌చ్చింది. పిలిచి ఏమ‌ని మాట్లాడారో తెలీదు కానీ బ‌య‌టికి వ‌చ్చేట‌ప్ప‌టికే ప‌ద్మావ‌తి క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయి.

చివ‌రి దాకా సాగ‌దీత‌

ఇప్ప‌టికే చాలా మటుకు YSRCP ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేసిన చివ‌రి ద‌శ లిస్ట్‌ను విడుద‌ల చేయాల్సి ఉంది. అయితే ఈ అంశాన్ని జ‌గ‌న్ చివ‌రి దాకా సాగించాల‌ని అనుకుంటున్నారు. లేక‌పోతే టికెట్ రానివారు పార్టీకి రాజీనామా చేసే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డుతున్నారు.