Jagan: “నాకు చెప్ప‌కుండా ఎందుకిలా చేస్తున్నారు?”

Jagan: YSRCP ఎంపీల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఇటీవ‌ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) ఢిల్లీలో ఇత‌ర నేత‌ల‌ను డిన్న‌ర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో కొంద‌రు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ విష‌యాన్ని YSRCP నేత‌ మిథున్ రెడ్డి జ‌గ‌న్‌కు చేర‌వేసారు. దాంతో జ‌గ‌న్ మండిప‌డ్డారు. మంత్రుల‌ను పిలిపించి ఎవ‌రెళ్లమ‌న్నారు.. నాకు చెప్ప‌కుండా ఎందుకు వెళ్లారు? పెద్ద‌వారు ఇలా చేస్తే ఎలా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. దాంతో ఎంపీలు ముఖం మాడ్చుకున్నారు.