CM Jagan: ప్రజా సమస్యలను పరిష్కరించడానికే నేను ఉన్నా..

vijayawada: ఏపీ ప్రభుత్వం(ap govt) మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం జగన్‌(cm jagan) ఆధ్వర్యంలో ‘జగనన్నకు చెబుదాం’(jagannaku chebudham) కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడారు. 1902కు ఫోన్‌ కొడితే… నేరుగా సీఎంఓకే ఫోన్‌ వస్తుందని, ఉన్నత స్థాయిలో సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల నుంచి మండలాలు, గ్రామాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. వాటితోపాటు.. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే.. నేరుగా తనకు తెలియజేయవచ్చని సీఎం జగన్ చెప్పారు.

‘ప్రజలకు సేవ అందించేందుకే నేను ఈ స్థానంలో ఉన్నాను.. సంతృప్త స్థాయిలో విన­తుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని’ ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. తొలుత క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. జగనన్నకు చెబుదాం కార్యక్రమం మిగతా కార్యక్రమాలకంటే భిన్నమైనదన్నారు. గతంలో ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా.. ప్రతి అడుగులోనూ వివక్ష, లంచాలు కనిపించేవి. వ్యవస్థల్లోకి లంచాలు, వివక్షలేని గొప్ప మార్పులను తీసుకు వచ్చాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మార్పులు తీసుకు వచ్చాం. స్పందనకు మరింత మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు సీఎం జగన్. మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని స్థాయిల్లో అందర్నీ భాగస్వాములను చేస్తున్నామన్నారు. సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.