TDP Janasena: ప‌వ‌న్ బాబు భేటీ.. జ‌న‌సేన సీట్లు తెదేపాకి?

TDP Janasena: తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీ అధినేత‌లు చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu), ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఈరోజు హైద‌రాబాద్‌లో మ‌రోసారి భేటీ అయ్యారు. ఎన్నిక‌ల వ్యూహం.. మిగిలిన అభ్య‌ర్ధుల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ చ‌ర్చ‌లో భాగంగా జ‌న‌సేన నుంచి ఒక‌టో రెండో సీట్లు మ‌ళ్లీ తెలుగు దేశం పార్టీకి బ‌దిలీ అయ్యే అవ‌కాశం ఉంది. ఈనెల 26 నుంచి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జాగ‌ళం యాత్ర‌ను మొద‌లుపెడ‌తారు. మ‌రోప‌క్క జ‌న‌సేనాని కూడా త‌న వారాహి వాహనాన్ని సిద్ధం చేయాల‌ని జ‌న‌సైనికుల‌ను ఆదేశించారు. ప‌వ‌న్ యాత్ర 27 నుంచి మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది.