Chandrababu Naidu: పెన్ష‌న్ల‌పై సీఎం కీల‌క నిర్ణ‌యం

Chandrababu Naidu key decision on pensions

 

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పెన్ష‌న్ల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పెన్ష‌న్‌ను ఒకేసారి రూ.1000 పెంచి రూ.4000 అందించ‌నున్నామ‌ని చంద్ర‌బాబు పింఛ‌నుదారుల‌కు లేఖ రాసారు. ప్ర‌జా సంక్షేమ‌మే ముఖ్యంగా భావించే ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌ని… ప్ర‌జ‌లు త‌న‌ను న‌మ్మి ఓటేసినందుకు వారి రుణం తీర్చుకుంటాన‌ని తెలిపారు. దివ్యాంగుల పెన్ష‌న్‌ను రూ.3000 నుంచి రూ.6000 పెంచుతున్న‌ట్లు తెలిపారు. జులై 1 నుంచి ల‌బ్ధిదారుల ఇంటి వ‌ద్ద‌కే పెన్ష‌న్లు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. దీని వ‌ల్ల ప్ర‌భుత్వంపై అద‌నంగా రూ.819 కోట్ల భారం పడుతున్నా ప్ర‌జా శ్రేయ‌స్సు కోసమే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని బాబు అన్నారు.