BRS పార్టీకి షాక్‌.. కాంగ్రెస్‌లోకి దామోద‌ర్ రెడ్డి

Hyderabad: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి (damodar reddy) BRS పార్టీకి షాకిచ్చారు. ఆయ‌న త్వ‌ర‌లో కాంగ్రెస్‌లో (congress) చేర‌బోతున్నారని ఎప్ప‌టినుంచో వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న నోరు విప్పింది లేదు. కానీ ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా (nagar kurnool) కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఘ‌ట‌నతో ఆయ‌న కాంగ్రెస్‌లోకి చేరుతున్న‌ట్లు క్లారిటీ వ‌చ్చేసింది. ఎన్నిక‌ల‌కు ముందు చాలా మంది BRS నేత‌లు ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు.