Lok Sabha Elections: పోలింగ్‌కు ముందే అక్క‌డ గెలిచేసిన‌ BJP

Lok Sabha Elections: లోక్ స‌భ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో పోలింగ్‌కు ముందే ఓ ప్రాంతంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ  (BJP) గెలిచేసింది. అది ఏ నియోజ‌క‌వ‌ర్గం అంటే.. గుజ‌రాత్‌లోని సూర‌త్. భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి ముఖేష్ ద‌లాల్ సూర‌త్‌లో పోటీ చేయ‌నున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో స‌హా నామినేషన్ వేసిన ఇత‌ర అభ్య‌ర్ధులు నామినేష‌న్‌ను వెన‌క్కి తీసుకోవ‌డంతో ముఖేష్ ద‌లాల్ ఏక‌గ్రీవంగా గెలిచేసారు. సూర‌త్ నుంచి మొత్తం ఎనిమిది మంది అభ్య‌ర్ధులు నామినేష‌న్ వేసారు. వారిలో ఒక‌రు కాంగ్రెస్ నుంచి కాగా.. మిగ‌తా ఏడుగురు ఇండిపెండెంట్ అభ్య‌ర్ధులు. కాంగ్రెస్ త‌ర‌ఫున నీలేష్ కుంభాని నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించ‌గా.. సంత‌కాల విష‌యంలో త‌ప్పులు ఉన్నాయ‌ని ఆయ‌న నామినేష‌న్‌ను జిల్లా రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌ తిర‌స్క‌రించారు.