EXCLUSIVE: జ‌గ‌న్‌కు బాలినేని వార్నింగ్

EXCLUSIVE: YSRCP పార్టీ త‌ర‌ఫున 5 సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా ప‌నిచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డిని (balineni srinivas reddy) పార్టీ పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేసింది. ఇప్పుడు ఆయ‌న మాట‌ల‌ను అస‌లు YCP కార్య‌క‌ర్త‌లు కూడా ప‌ట్టించుకోవ‌డంలేదు. ఒంగోలు టికెట్‌ను మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వాల‌ని బాలినేని YCP హైక‌మాండ్‌ను కోర‌గా.. ఇందుకు ఒప్పుకోలేదు. పోనీ మాగుంట‌కు ఇవ్వ‌క‌పోయినా త‌న కుమారుడు ప్ర‌ణీత్ రెడ్డికి అయినా టికెట్ ఇవ్వాల‌ని కోరితే అందుకు కూడా కుద‌ర‌దు అనేసారు. దాంతో బాలినేనికి తిక్క‌రేగింది. టికెట్ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డికి ఇస్తే వాడు ఎలా గెలుస్తాడో చూస్తా అంటూ త‌న అనుచ‌రుల‌తో జ‌గ‌న్‌కు వార్నింగ్ ఇస్తున్న‌ట్లు మండిప‌డ్డారు బాలినేని.

మ‌రోప‌క్క మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగు దేశం పార్టీతో (TDP) మంత‌నాలు జ‌రుపుతున్నారు. బాలినేని, మాగుంట‌ల‌ను క‌న్విన్స్ చేసేందుకు విజ‌య సాయి రెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిలు రంగంలోకి దిగినా ఫ‌లితం లేకుండాపోయింది.