Babu Mohan మ‌ళ్లీ జంప్.. కేఏ పాల్‌కు గుడ్‌బై చెప్పి BRSలోకి

Babu Mohan: త‌న‌కు టికెట్ ఇవ్వ‌నందుకు బాధ‌ప‌డి భార‌తీయ జ‌న‌తా పార్టీకి  (BJP) రాజీనామా చేసి ప్ర‌జాశాంతి పార్టీలో చేరారు న‌టుడు బాబు మోహ‌న్. ప్ర‌జాశాంతిలో (Prajashanti Party) చేరి నెల రోజులు కాకుండానే కేఏ పాల్‌కు (KA Paul) షాకిచ్చి భార‌త రాష్ట్ర స‌మితిలో (BRS) చేర‌బోతున్నారు. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ అభ్య‌ర్ధిగా సీటు ఇస్తాన‌ని KCR మాటివ్వ‌డంతో బాబు మోహ‌న్ పార్టీలో చేరేందుకు ఒప్పుకున్నారు. అయితే పాపం కేఏ పాల్ మొన్ననే ప్రజాశాంతి పార్టీ తెలంగాణ‌ రాష్ట్ర అధ్యక్షులుగా బాబు మోహన్‌ని ప్రకటించారు.