Udayanidhi Stalin త‌ల తెస్తే రూ.10 కోట్లు.. స్వామీజీ ఆఫ‌ర్

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ (mk stalin) కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్ (udayanidhi stalin) స‌నాత‌న ధ‌ర్మం గురించి చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా ర‌గులుతున్నాయి. స‌నాత‌న ధ‌ర్మం (sanathana dharma). అనేది ఒక మ‌లేరియా, డెంగూలా దేశంలో వ్యాపిస్తోంద‌ని, దీనిని వ్య‌తిరేకించ‌డం కాకుండా పూర్తిగా నిర్మూలిస్తేనే దేశం బాగుప‌డుతుంద‌ని ఆయ‌న అన్నాడు. దాంతో డీఎంకేకు స‌పోర్ట్‌గా ఉన్న కాంగ్రెస్‌లోని కొంద‌రు నేత‌ల‌తో స‌హా ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీల వారు ఉద‌య‌నిధి వెంట‌నే స‌నాత‌న ధ‌ర్మంపై చేసిన వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోవాల‌ని లేదంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

ఎవ‌రు ఏన్ని కేసులు పెట్టినా తాను అన్న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోన‌ని కావాలంటే ఇంకా ఎక్కువ మాట్లాడాన‌ని ఉదయ‌నిధి ప‌ట్టుబ‌ట్టాడు. ఈ నేప‌థ్యంలో అయోధ్యకు (ayodhya) చెందిన స్వామీజీ ఒకరు.. ఉద‌య‌నిధి త‌ప్పుగా మాట్లాడుతున్నాడ‌ని, అత‌ను అన్న మాట‌ల‌కు అత‌ని త‌ల న‌రికి ఎవ‌రు తెస్తారో వారికి రూ.10 కోట్లు ఇస్తాన‌ని అన్నారు. స్వామీజీ బెదిరింపుల‌కు పాల్ప‌డిన వీడియోపై ఉద‌య‌నిధి స్పందిస్తూ..త‌న త‌ల‌పై స్వామీజీకి అంత ప్రేమ ఎందుకో అర్థంకావ‌డంలేద‌ని, ఎవ‌రికో రూ.10 కోట్లు ఇచ్చే బ‌దులు త‌న‌కే ప‌ది రూపాయ‌లు ఇస్తే ఓ దువ్వెన కొనుక్కుని దువ్వుకుంటాన‌ని హేళ‌న చేసాడు. అస‌లు ఒక స్వామీజీ ద‌గ్గ‌ర రూ.10 కోట్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌ని నిల‌దీసారు. (udayanidhi stalin)