Amit Shah: తెలంగాణ‌కు డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ అవ‌స‌రం

తెలంగాణ రాష్ట్రానికి డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ అవ‌స‌రం ఉంద‌ని అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah). ఆదిలాబాద్‌లో (adilabad) ఏర్పాటుచేసిన బ‌హిరంగ స‌భ‌లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ ప‌దేళ్ల పాల‌న‌లో తెలంగాణ సీఎం KCR.. KTRను సీఎం ఎలా చేయాల‌నే ఆలోచించార‌ని ఆరోపించారు. గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యానికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌కరించ‌లేద‌ని అన్నారు. అన్ని వ‌ర్గాల‌కు అండ‌గా ఉండేది న‌రేంద్ర మోదీ మాత్ర‌మేన‌ని అన్నారు. సొంత కుటుంబం కోసం ప‌నిచేసే స‌ర్కార్ కావాలా.. ప్ర‌జ‌లే కుటుంబంగా భావించే స‌ర్కార్ కావాలా అని ప్ర‌శ్నించారు. ఆదివాసీల కోసం KCR ఏమీ చేయ‌లేద‌ని.. కానీ మోదీ ఆదివాసీ అయిన ద్రౌప‌ది ముర్మ‌ను ఈ దేశానికి రాష్ట్ర‌ప‌తిని చేసార‌ని తెలిపారు. తెలంగాణ‌లో డిసెంబ‌ర్ 3న BJP ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు.