Pawan Kalyan: తెలంగాణ‌లో ఆంధ్రోళ్లని త‌రిమేస్తున్నారు

AP: వారాహి విజ‌య యాత్ర‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) తెలంగాణ ప్ర‌జ‌ల‌పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసాయి. జగన్.. (ap cm jagan) నువ్వు ఉపాధి అవకాశాలు కల్పించవు, పరిశ్రమలు రానివ్వవు, పారిశ్రామికవేత్తలను బతకనివ్వవు. ఎవరైనా కంపెనీ పెడితే నీ ఎమ్మెల్యేలు లంచాలు కావాలని పీడించేస్తారు. యువత ఎక్కడికి వెళ్ళాలి.. తెలంగాణకి వెళ్తే వాళ్ళేమో మీ ఆంధ్ర వాళ్లు దోచేశారు.. దొబ్బేయండి అని తిడుతున్నారు. మీ నాన్న లాగా, నీలాగా దొచేయడానికి మా దగ్గర డబ్బుల్లేవు. మేము మా నేల లోనే బతకాలి అని షాకింగ్ కామెంట్స్ చేసారు. దాంతో తెలంగాణ (telangana) ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ ఎన్నిక‌ల (ap elections) ప్ర‌చారంలో తెలంగాణ ప్ర‌జ‌ల గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని అంటున్నారు.