IPL: లక్ష మంది ‘వందే మాతరం’ పాడితే ద‌ద్ద‌రిల్లిపోయింది!

ఐపీఎల్‌ మ్యాచ్‌లు శుక్రవారం సాయంత్రం నుంచి మొదలయ్యాయి. అయితే.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సుమారు లక్ష మంది వరకు క్రికెట్‌ అభిమానులు వచ్చారు. తొలి మ్యాచ్‌ గుజరాత్‌ చెన్నై జట్ల మధ్య జరగగా… ఆ మ్యాచ్‌కు గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్బంగా స్టేడియంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు రెహమాన్ ఆలపించిన ‘మా తుఝే సలామ్’ పాటను ప్లే చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన ఇక్కడ ఒకేసారి లక్ష మంది ప్రేక్షకులు ‘వందే మాతరం’ అంటూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి భారతీయుడికి రోమాలు నిక్కబొడుచుకోకుండా ఉంటాయా.. మీరు చూసేయండి మరి.