Namrata Shirodkar: మ‌హేష్‌కి ముందు న‌మ్ర‌త అత‌న్ని చేసుకోవాల‌నుకున్నార‌ట‌

Namrata Shirodkar wanted to marry deepak before mahesh babu

Namrata Shirodkar: టాలీవుడ్‌లో క్యూటెస్ట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిరోద్క‌ర్ జంట ఒక‌టి. వీరిద్ద‌రి ప‌రిచయం వంశీ సినిమాతో మొద‌లై.. అది కాస్తా ప్రేమ‌గా మారి పెరిణ‌యానికి దారితీసిందన్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.  అయితే మ‌న‌కి తెలీని విష‌యం ఏంటంటే.. మ‌హేష్ కంటే ముందు న‌మ్ర‌త‌ దీప‌క్ శెట్టి అనే ఓ రెస్టారెంట్ య‌జ‌మానిని వివాహం చేసుకోవాల‌నుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో న‌మ్ర‌తే స్వ‌యంగా వెల్ల‌డించారు. న‌మ్ర‌త మోడ‌లింగ్ చేస్తున్న స‌మ‌యంలో దీప‌క్‌తో ప్రేమ‌లో ఉన్నారు. వీరిది దాదాపు తొమ్మిదేళ్ల ప్రేమ‌ట‌. అయితే 2008లో దీపక్ ఓ ప్ర‌మాదంలో చ‌నిపోయారు. అప్ప‌టికే న‌మ్ర‌త‌, మ‌హేష్‌ల‌కు పెళ్లి కూడా అయిపోయింది.

తాను స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు దీప‌క్‌ను త‌ప్ప‌కుండా పెళ్లి చేసుకుంటాన‌ని కూడా చెప్పారు. కానీ త‌ర్వాత ఏమైందో ఏమో వీరిద్దరూ విడిపోయారు. ఆ త‌ర్వాత న‌మ్ర‌త మ‌హేష్‌ను వివాహ‌మాడారు. 2008లో దీప‌క్‌ గోవాలో ఓ బాలుడి ప్రాణాల‌ను కాపాడ‌బోయి అత‌ను స‌ముద్రంలో మునిగిపోయి చ‌నిపోయాడ‌ట‌. అదే సంవ‌త్స‌రంలో న‌మ్ర‌త త‌ల్లి కుందా క్యాన్స‌ర్‌తో చ‌నిపోయారు. ఇక న‌మ్ర‌త‌, మ‌హేష్ వంశీ సినిమా త‌ర్వాత ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. 2005లో వీరి వివాహం జ‌రిగింది. పెళ్లి త‌ర్వాత న‌మ్ర‌త సినిమాలు మానేసి కుటుంబానికే ప్రాధాన్య‌మిస్తున్నారు.