‘అల్లు అర్జున్​‌‌, స్నేహారెడ్డికి హాట్సాఫ్​’

‘గంగోత్రి’ సినిమాతో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్​ క్లాస్​, మాస్​, యాక్షన్​తో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాన్​ఇండియా స్థాయిలో క్రేజ్​ సంపాదించుకన్న విషయం తెలిసిందే. బన్నీతోపాటు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డికీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఎక్కువే. ఇక వీరిద్దరి గారాల పట్టి అల్లు అర్హ. వీరి ఇద్దరు పిల్లల్లో అయాన్​ కంటే అర్హ చలాకీగా ఉంటుందని అందరికీ తెలిసిందే. శాకుంతలం సినిమాతో ఈ చిన్నారిని వెండితెరపై చూడబోతున్నాం. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్హ టాలెంట్ గురించి మాట్లాడుతూ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

అర్హ ఇప్పటి వరకు తన ముద్దు మాటలతో, చిలిపి చేష్టలతో అందర్నీ ఆకట్టుకుంది.. అలాగే మట్టి వినాయకుడి విగ్రహం తయారు చేయడం.. పిల్లలకి చెస్ నేర్పించి నోబుల్ బుక్ ఎక్కడం వంటి టాలెంట్ చూపించి సర్‌ప్రైజ్ చేసింది.. అర్హతో పాటు బన్నీ ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్, వీడియోస్ ఎప్పుడు షేర్ చేసినా కానీ వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా క్లిష్టమైన యోగాసనాలు వేస్తున్న తన గారాల పట్టీని చూసి బన్నీ మురిసిపోయిన వీడియో వైరల్​ అయింది. ‘బ్రిలియంట్.. వండర్ కిడ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్​. ఇదిలా ఉంటే.. గుణ శేఖర్, సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కించిన హిస్టారికల్ ఫిలిం ‘శాకుంతలం’ తో అల్లు అర్హను బాల నటిగా పరిచయం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సమంత అర్హ గురించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ సినిమాలో శకుంతలగా సమంత, దుశ్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తుండగా.. అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ భరతుడి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో అర్హకి భారీ డైలాగ్స్ ఉన్నాయట. ఈ డైలాగ్స్ అర్హ ఎలా చెప్పింది? సెట్స్ లో ఎలా మెలిగింది అనే విషయాలు సమంత చెప్పుకొచ్చింది. సెట్స్ లో అల్లు అర్హ తెలుగు మాట్లాడుతుంటే చాలా క్యూట్ గా అనిపించిందని సమంత చెప్పింది. వందల మంది ముందు ఏ మాత్రం భయపడకుండా అల్లు అర్హ డైలాగ్స్ చెప్పిందని సమంత తెలిపింది. ఈ రోజుల్లో పిల్లలకు ఇంగ్లీష్ ఎలాగైనా వస్తుంది కానీ అర్హకి తెలుగు అంత బాగా నేర్పించిన అల్లు అర్జున్, స్నేహరెడ్డిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి అని పేర్కొంది సామ్.

సమంత కెరీర్ లో వస్తున్న తొలి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. నీలిమ గుణ, దిల్ రాజు (Dil Raju) నిర్మాతలుగా శాకుంతలం అనే పౌరాణిక గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, గౌత‌మి, మ‌ధుబాల‌, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వదిలిన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఫిబ్రవరి 17న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అనూహ్యంగా వాయిదా వేసి ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.