“భీమ్లా నాయ‌క్” న‌టుడి అనుమానాస్ప‌ద మృతి.. కారులో మృత‌దేహం ల‌భ్యం

Vinod Thomas: మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీని వ‌రుస మ‌ర‌ణాలు కుదిపేస్తున్నాయి. ఇప్ప‌టికే ముగ్గురు న‌టులు వారం గ్యాప్‌లోనే చ‌నిపోయారు. ఈరోజు వినోద్ థామ‌స్ అనే మ‌రో న‌టుడు అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. ఆయ‌న మృతదేహం కారులో ల‌భ్యం కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. కొట్టాయంలోని పాంప‌డీ ప్రాంతంలో వినోద్ మృత‌దేహం ల‌భించింది.

ఓ హోట‌ల్ ఎదురుగా రెండు రోజుల నుంచి ఒక కారు ఆగి ఉందని.. అనుమానం వ‌చ్చి తెరిచి చూడ‌గా వినోద్ చ‌నిపోయి క‌నిపించార‌ని స్థానికులు చెప్తున్నారు. కారులో విష‌పూరిత‌మైన గాలి పీల్చ‌డంతో బ‌య‌టికి రాలేక ఊపిరాడ‌క చ‌నిపోయిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయ్య‌పానుమ్ కోషియం సినిమాలో వినోద్ థామ‌స్ కీల‌క రోల్‌లో న‌టించారు. ఈ సినిమాను తెలుగులో భీమ్లా నాయ‌క్‌గా తీసారు.