SSMB 28 : డ్యుయెల్​ రోల్​లో మహేష్​.. ఆ సినిమా కథే అంటున్న ఫ్యాన్స్​!

Hyderabad:సూపర్​స్టార్​ మహేష్​ (Mahesh Babu)‌‌– త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్​ మోస్ట్​ అవెయిటెడ్​ సినిమాల్లో ఇది కూడా ఒకటి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నోట్లో సిగరెట్ పట్టుకొని మహేష్ బాబు స్టైల్ గా నడిచి వస్తున్న పోస్టర్​ విడుదల చేసి రిలీజ్​ డేట్​ అనౌన్స్​ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా కథకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
అతడు(Athadu) , ఖలేజా(Khaleja) సినిమాల తర్వాత మహేశ్ బాబు(Mahesh Babu) అండ్ త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో మూడో సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఆ మూవీ గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులోనూ తండ్రీ కొడుకులుగా మహేశ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్. కథ కాస్త నందమూరి బాలకృష్ణ రీసెంట్ హిట్ ‘వీర సింహా రెడ్డి’ తో పోలి ఉంటుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలంటే కనీసం టీజర్ వచ్చే వరకు అయిన ఆగాల్సిందే. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి పాన్ ఇండియా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.