Shruti Haasan: క‌ర్మ ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌దు

క‌ర్మ ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌దు అంటూ శ్రుతి హాసన్ (shruti haasan) పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆమె ఎవ‌రిని ఉద్దేశిస్తూ ఆ పోస్ట్ పెట్టిందో తెలీదు కానీ చాలా మంది వారి వారి అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్నారు. ఇంత‌కీ శ్రుతి ఏమ‌ని పోస్ట్ చేసిందంటే.. ఎవ‌రు తీసుకునే గోతిలో వాళ్లు ప‌డ‌తారు. నేను మౌనంగా ఉంటా. నా ప‌ని నేను చేసుకుంటూ వెళ్లిపోతా. క‌ర్మ దాని ప‌ని అది చ‌క్క‌గా చేసుకుని వెళ్లిపోతుంది అని పోస్ట్ చేసారు. అయితే ఆమె ఎవ‌రిని ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ పెట్టారో మాత్రం క‌నీసం హింట్ కూడా ఇవ్వ‌లేదు. వాల్తేరు వీర‌య్య‌, వీరసింహారెడ్డి సినిమాల త‌ర్వాత ఇప్పుడు ప్ర‌భాస్‌తో (prabhas) క‌లిసి స‌లార్‌లో (salaar) న‌టిస్తోంది శ్రుతి. (shruti haasan)