Samantha కెరీర్​ ముగిసినట్టే.. ప్రొడ్యూసర్​ సంచలన వ్యాఖ్యలు!

Hyderabad: టాలీవుడ్​ హీరోయిన్​ సమంత(Samantha) గత కొంత కాలంగా పలు విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకులు, పుష్ప(Pushpa)లో ఐటెం సాంగ్ చేయడం, మయోసైటిస్​తో బాధపడుతున్నాని చెప్పడంతో ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సమంత(Samantha) ప్రధానపాత్రలో నటించిన శాకుంతలం(Shakunthalam) పాన్ ఇండియా(Pan India) సినిమాగా ఈరోజు (ఏప్రిల్​ 14) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

కాగా, ఇన్నాళ్లుగా విడాకులు, తన లైఫ్ గురించి మాట్లాడని సమంత శాకుంతలం ప్రమోషన్స్​లో మాత్రం విడాకుల తర్వాత లైఫ్ ఎలా మారిపోయిందో, ఈ రెండేళ్లలో తను పడిన కష్టాలు, బాధలు, ఆరోగ్యం గురించిన అన్ని విషయాలను పంచుకుంది.  తాజాగా ఓ టాలీవుడ్ నిర్మాత సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు(Chitti Babu) తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ.. ‘సమంత కెరీర్ అయిపోయింది. విడాకుల తర్వాత ఆమె బతకాడానికి ఐటెం సాంగ్ చేసింది. ఆమె సెంటిమెంట్ డ్రామాలతో ప్రేక్షకులని రప్పించాలని చూస్తుంది. యశోద సినిమా టైంలో ఆరోగ్యం బాగోలేకపోయినా డబ్బింగ్ చెప్పాను అంటూ ప్రమోట్ చేసుకుంది. గతంలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఆరోగ్యం బాగోలేకపోయినా వచ్చి షూటింగ్స్ చేశారు. క్యాన్సర్ వచ్చినా కూడా వచ్చి సినిమాలు చేశారు. ఇప్పుడు శాకుంతలం రిలీజ్ కి ముందు మళ్ళీ ఆరోగ్య సమస్యలు అని, పర్సనల్ బాధలని మాట్లాడుతుంది. చచ్చిపోయేలోపు ఈ ప్రాజెక్టు చేస్తానో చేయనో అని చెప్పింది. ఇలా సెంటిమెంట్ డ్రామాలు ఆడి, మీడియా ముందు ఏడ్చేస్తే ప్రేక్షకులు వస్తారనుకుంటుంది. ఒకవేళ వచ్చినా సినిమా బాగుంటేనే హిట్ అవుతుంది. ఇప్పుడు సమంతకు స్టార్​డమ్​ లేదు. అసలు అలాంటి హీరోయిన్ ని శాకుంతలం లాంటి మంచి కథకు ఎందుకు తీసుకున్నారో తెలియట్లేదు’ అని కామెంట్స్ చేశారు.