Samantha కొత్త ఇల్లు ధరెంతో తెలుసా!

Hyderabad: టాలీవుడ్(Tollywood)​ స్టార్​ హీరోయిన్ సమంత(Samantha)​ ఏదో ఒకరకంగా నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల విడుదలైన శాకుంతలం(Shaakunthalam) సినిమా ఫలితంతో కాస్త డల్​ అయిన సామ్ ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్నారు. గుణ శేఖర్(Guna Shekar)​ దర్శకత్వలో దిల్​ రాజు(Dil Raju), నీలిమ గుణ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత శకుంతలగా నటించింది. కథనం, స్క్రీన్​ప్లే, గ్రాఫిక్స్​ లోపాల వల్ల ఈ సినిమా ఊహించని విధంగా నెగెటివ్​ టాక్​ అందుకుని సామ్​ కెరీర్​లో అతి పెద్ద డిజాస్టర్​గా మిగిలిపోయింది. ప్రస్తుతం సిటాడెట్(Citadel)​ వెబ్​ సిరీస్​ ఇండియన్​ వెర్షన్​, ఖుషి(Kushi) సినిమాలతో బిజీగా ఉన్న సామ్​ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ​

సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఒక ఖరీదైన అపార్ట్‌ మెంట్‌ను కొనుగోలు చేశారని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని జయభేరి కౌంటీలో ఖరీదైన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను సామ్ కొనుగోలు చేసిందని టాక్. 13, 14వ ఫ్లోర్‌‌లో సామ్ కొనుగోలు చేసిన ఫ్లాట్ ఉందని తెలుస్తోంది. 6 పార్కింగ్ స్టాట్లతో 7 నుంచి 8 కోట్లు ఖర్చు చేసి 3BHK ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. కాగా, సమంతకు ఇప్పటికే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అత్యంత ఖరీదైన ఇల్లు ఉంది. ఇటీవల ముంబైలో దాదాపు రూ.15 కోట్లతో ఒక అపార్ట్‌ మెంట్ కొనుగోలు చేశారు. ఇప్పుడు మరో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను తన ఆస్తుల లిస్టులో వేసుకున్నారు సామ్​. విజయ్​ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా నుంచి తాజాగా విడుదలైన ఫస్ట్​ సాంగ్​ యూట్యూబ్​లో అద్భుతమైన స్పందనతో ట్రెండింగ్​లో నిలుస్తోంది. ఈ సాంగ్​లో సామ్​ క్యూట్​ లుక్స్​తో అలరించింది.