Manchu Vishnu: “నేను బ‌రాబ‌ర్ ల‌క్ష‌ద్వీప్‌కే పోతా”

Manchu Vishnu: ల‌క్ష‌ద్వీప్, మాల్దీవుల అంశంపై ర‌చ్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ట్వీట్ చేసారు న‌టుడు మంచు విష్ణు. త‌న త‌ర్వాతి డెస్టినేష‌న్ హాలిడే ల‌క్ష‌ద్వీప్ అని ట్వీట్ చేసారు. ఇంత‌కీ మంచు విష్ణు ఇప్పుడు ఈ ట్వీట్ ఎందుకు చేసారు అనుకుంటున్నారా?

జ‌రిగింది ఇది

ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ల‌క్ష‌ద్వీప్‌లో ప‌ర్య‌టించారు. దీనిపై మాల్దీవ్స్ మంత్రులు ఓవ‌రాక్ష‌న్ చేస్తూ మోదీపై భార‌త్‌పై వ్య‌తిరేకంగా దారుణ‌మైన కామెంట్స్ చేసారు.

దాంతో మాల్దీవ్స్‌పై యావ‌త్ భార‌త‌దేశం విరుచుకుప‌డుతోంది. ఎందుకు అంత ద్వేషం అంటూ రాజ‌కీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్ర‌ముఖులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు కూడా ల‌క్ష‌ద్వీప్‌కే త‌న మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు.