Anasuya Bharadwaj: జ‌న‌సేన త‌ర‌ఫు ప్ర‌చారం చేస్తా

Anasuya Bharadwaj: ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఆహ్వానిస్తే జ‌న‌సేన (Janasena) త‌ర‌ఫున రాబోయే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తాన‌ని అన్నారు యాంక‌ర్, న‌టి అనసూయ భ‌రద్వాజ్. త‌న‌కు ఈ రాజ‌కీయాల నుంచి పార్టీల గురించి అంత‌గా తెలీద‌ని.. కానీ ప‌వ‌న్ పిలిస్తే మాత్రం త‌ప్ప‌కుండా వెళ్తాన‌ని పేర్కొన్నారు. అన‌సూయ‌కు మెగా ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది. జ‌బ‌ర్ద‌స్త్‌కు అన‌సూయ యాంక‌రింగ్ చేస్తున్న‌ప్పుడు నాగ‌బాబు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించేవారు. మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ అన‌సూయ మెగా ఫ్యామిలీకే స‌పోర్ట్ చేసి ప్ర‌కాశ్ రాజ్‌కు ఓటు వేసానని అన్నారు.