Tollywood: సంక్రాంతి పందెంకోళ్లు..!

తెలుగు పండుగ‌ళ్లో సంక్రాంతి (sankranthi) మూడు రోజుల పాటు జ‌రుపుకునే సుదీర్ఘ పండుగ‌. భోగి, సంక్రాంతి, క‌నుమ.. ఇలా మూడు రోజులూ ప్ర‌త్యేక‌మే. ఈ మూడు రోజులూ టాలీవుడ్‌కీ (tollywood) ప్ర‌త్యేమ‌నే చెప్పాలి. ఎందుకంటే మూడు రోజుల పండుగ‌లో ఏ సినిమా అయినా రిలీజ్ అయితే దానికి వచ్చే క‌లెక్ష‌న్లు కూడా బాగుంటాయ‌ని నిర్మాత‌ల అభిప్రాయం. మ‌రి ఈసారి 2024 సంక్రాంతి బ‌రిలో ఉన్న పందెంకోళ్లు ఏవో చూద్దామా..!

గుంటూరు కారం (guntur kaaram)

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu) చాలా కాలం త‌ర్వాత మాస్ అవ‌తార్‌లో క‌నిపించ‌నున్న సినిమా ఇది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ (trivikram srinivas) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి, శ్రీలీల హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న రిలీజ్ అవ్వ‌నుంది.

ఈగ‌ల్ (eagle)

మాస్ మ‌హారాజా ర‌వితేజ (ravi teja) సినిమా ఈగ‌ల్  (eagle) కూడా సంక్రాంతి బ‌రిలో ఉంది. కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా జ‌న‌వ‌రి 13న రిలీజ్ అవ్వ‌నుంది. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (anupama parameshwaran) హీరోయిన్‌గా న‌టించారు.

సైంధ‌వ్ (saindhav)

రానా నాయుడు వెబ్‌సిరీస్‌తో త‌న‌కున్న ఇమేజ్‌పై కాస్త మ‌చ్చ‌ప‌డేలా చేసుకున్నారు విక్ట‌రీ వెంక‌టేష్ (venkatesh). ఇప్పుడు సైంధ‌వ్ సినిమాతో మ‌ళ్లీ త‌న ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్‌తో ప్రేక్ష‌కులను అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమాను జ‌న‌వ‌రి 13న రిలీజ్ చేయ‌నున్నారు.

నా సామి రంగ‌ (na saami ranga)

వ‌రుస ఫ్లాప్స్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కింగ్ అక్కినేని నాగార్జున (nagarjuna) ఇప్పుడు నా సామి రంగ సినిమాతో మాస్ అవ‌తార్‌లో అల‌రించ‌నున్నారు. మ‌ల‌యాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన పోరింజు కురియ‌న్ జోస్ అనే సినిమాకు రీమేక్‌గా రాబోతోంది. ఈ సినిమాను జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేయ‌నున్నారు.