Naresh: కృష్ణ‌గారు, మ‌హేష్ మ‌మ్మ‌ల్ని యాక్సెప్ట్ చేసారు

Hyderabad: వీకే న‌రేష్(naresh), ప‌విత్ర లోకేష్(pavitra lokesh) రిలేష‌న్‌షిప్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కుంటున్న‌ప్ప‌టికీ.. తాము స‌మాజంలో గౌర‌వంగానే బ‌తుకుతున్నామంటూ ఒక‌రిపై ఒక‌రికి ఎంత ఇష్టం ఉందో వ్య‌క్త‌ప‌రుస్తూనే ఉన్నారు. వీరిద్ద‌రూ క‌లిసి మళ్లీ పెళ్లి(malli pelli) అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ప్రేమ‌, పెళ్లికి వ‌య‌సుతో సంబంధం లేదు అనేదే ఈ మ‌ళ్లీ పెళ్లి కాన్సెప్ట్. అయితే టీజర్, ట్రైల‌ర్ చూస్తే న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ జీవితంలో జ‌రిగే సంఘ‌ట‌న‌లను ఓ బ‌యోపిక్‌లా తీసారేమో అనిపిస్తోంది. దాని గురించి న‌రేష్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.

“ఇది ఎవ్వ‌రినో ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ప‌గ ప్రతీకారం తీర్చుకోవాలంటే కోర్టు, పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు వెళ్ల‌చ్చు కానీ సినిమా తీయాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం దేశంలో దాంప‌త్య జీవితాలు ఎలా ఉన్నాయో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించే సినిమా ఇది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డం, అవి బ‌య‌టికి చెప్పుకోలేక న‌లిగిపోతున్న‌వారు చాలా మంది ఉన్నారు. స‌మాజం కోసం ఇష్టం లేక‌పోయినా క‌లిసి బ‌తకాల‌న్న రూల్ లేదు. ఎవ‌రి జీవితం వారిది అన్న సందేశాన్ని మాత్ర‌మే ఇవ్వాల‌నుకుంటున్నాం. ఈ సినిమాను మూడేళ్ల క్రిత‌మే ఎంఎస్ రాజుతో ప్లాన్ చేసాను. ఆయ‌న కృష్ణ‌గారితో కూడా మాట్లాడారు. సినిమా ఐడియా డిఫ‌రెంట్‌గానే ఉంది కానీ జాగ్ర‌త్త‌గా తీయండి అని చెప్పారు. ఇక‌పోతే మా ప్రేమ‌కు కృష్ణ‌గారితో పాటు మ‌హేష్ కూడా యాక్సెప్ట్ చేసారు. మేమంతా ఒక్కటే మాట మీద ఉంటాం. అన్నీ అంద‌రితో చ‌ర్చించాకే డెసిష‌న్ తీసుకుంటాం. మా కుటుంబం అంతా ఒక్క‌టే” అని వెల్ల‌డించారు న‌రేష్‌.