Tirumala: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి!

Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం(Road Accident) జరిగింది. 24వ మలుపు వద్ద తుఫాన్ వాహనం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. భక్తులు తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం జరగడంతో ఘాట్ రోడ్డులో కొంత సమయం ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన భక్తులు తెలంగాణకు చెందిన వారని తెలుస్తోంది.