Posani: మరోసారి కరోనాతో ఆసుపత్రిలో చేరిన పోసాని!

Hyderabad : టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ(Posani Krishna Murali) కరోనా(Corona)తో ఆసుపత్రిలో చేరారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నపోసాని గత కొద్ది రోజులుగా దగ్గు జలుబుతో బాధపడుతూ ఈరోజు హైదరాబాద్​లోని ఏఐజీ(AIG) హాస్పిటల్లో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు కరోనా సోకినట్లు తెలిపారు.

ప్రస్తుతం సినిమాలలో నటించడమే కాక ఏపీ ఫిలిం డెవలప్​​మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాధ పడుతున్న పోసాని కృష్ణ మురళీ నేడు ఉదయం హైదరాబాద్​ గచ్చిబౌలిలోని  AIG హాస్పిటల్ లో చేరారు. కరోనా సోకినట్టు వైద్యులు అనుమానించి టెస్ట్ లు చేయడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. గతంలో పోసాని రెండు సార్లు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు మరోసారి కరోనాతో హాస్పిటల్ లో చేరడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.