RK Roja: ప‌రువు పోయిందిగా..!

netizens give shock to rk roja

RK Roja: వైఎస్సార్ కాంగ్రెస్ నేత రోజా త‌న ప‌రువు తానే తీసుకున్నారు. తిరుమ‌ల ల‌డ్డూ వివాదం నేప‌థ్యంలో ఆమె సోష‌ల్ మీడియాలో ఓ పోల్ పెట్టారు. తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో త‌ప్పు ఎవ‌రిది? అన్న పోల్ ప్ర‌శ్న‌కు ఆప్ష‌న్ A ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆప్ష‌న్ బB చంద్ర‌బాబు నాయుడు ఆప్ష‌న్ C జగ‌న్ మోహ‌న్ రెడ్డి అని ఆప్ష‌న్లు ఇచ్చారు. ఈ పోల్‌లో 7 శాతం మంది ప‌వ‌న్‌కి, 20 శాతం చంద్ర‌బాబు నాయుడుకి, 73 శాతం జ‌గ‌న్‌దే త‌ప్పు అని ఓటు వేసారు. ఈ పోల్ ఒక్క‌టే కాదు.. తిరుమ‌ల ఎవ‌రి పాల‌న‌లో బాగుంది అన్న పోల్ పెట్ట‌గా 77 శాతం మంది చంద్ర‌బాబు నాయుడుకే ఓటు వేయ‌డంతో  రోజా త‌న ప‌రువు తానే తీసుకున్న‌ట్లు అయ్యింది. ఈ విష‌యాన్ని తెలుగు దేశం పార్టీ నేత కిరాక్ ఆర్పీ కూడా మీడియా ద్వారా పోల్‌కి రిప్లై ఇవ్వ‌డాన్ని కూడా చూపించారు. ఆ త‌ర్వాత రోజా ఈ పోల్స్‌ని డిలీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది