Raghunandan Rao: KTR స‌మంత‌నే ఎందుకు పెట్టారు?

Raghunandan Rao questions ktr about samantha

Raghunandan Rao: BRS అధికారంలో ఉన్న‌ప్పుడు తెలంగాణ‌ చేనేత వ‌స్త్రాల బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా KTR న‌టి స‌మంత‌నే ఎందుకు ఎంపిక‌చేసార‌ని ప్ర‌శ్నించారు BJP నేత‌ ర‌ఘునంద‌న్ రావు. 2014లోనే నాగార్జునకు చెందిన ఎన్ క‌న్వేన్ష‌న్ సెంట‌ర్‌ను కూల్చేయాల‌ని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన‌ప్పుడు BRS ప్ర‌భుత్వం ఎందుకు పట్టించుకోలేదు అని నిల‌దీసారు.

కేటీఆర్ మున్సిప‌ల్ మినిస్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు నాగార్జున‌తో డీలింగ్ చేసుకున్నాడ‌ని.. ఆ డీలింగ్‌లో భాగంగానే ఆయన మాజీ కోడ‌లైన స‌మంత‌ను చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించార‌ని ఆరోపించారు. కేటీఆర్, హ‌రీష్ రావు, క‌విత‌ల‌కు సంబంధించిన అక్ర‌మ బిల్డింగ్‌ల‌ను కూడా కూల్చేయాల‌ని.. దీంతో పాటు 2014 నుంచి ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌కు వ‌చ్చిన రాబ‌డి లెక్క‌లు బ‌య‌టికి తీయాల‌ని అన్నారు.