TDPలోకి ఆరుగురు YSRCP ఎంపీలు

ysrcp mp's to join tdp

TDP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ్య‌స‌భ‌లో 11 ఎంపీలు ఉన్నారు. కానీ తెలుగు దేశం పార్టీకి రాజ్య‌స‌భ‌లో బ‌లం లేదు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు ఆరుగురు ఎంపీలు తెలుగు దేశంలో చేర‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. స్వ‌యాన్ సాక్షి ప‌త్రికే ప‌రోక్షంగా రాసింది. తెలుగు దేశం పార్టీ వారిని కొనుగోలు చేయాల‌ని చూస్తోంది అన్న కోణంలో రాసింది. మరో ఏడాదిన్నర తర్వాత రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలుగు దేశం పార్టీ ఇప్ప‌టినుంచే రాజ్య‌స‌భ‌లో త‌మ బ‌లాన్ని పెంచుకునేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది.