Viral News: అస్సాంలో ఒంగోలు వాసి దారుణ హ‌త్య‌

ongole resident murdered by student in assam

Viral News: అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. మంద‌లించాడ‌ని ఓ ఇంట‌ర్ విద్యార్థి ఏకంగా ప్రిన్సిప‌ల్‌నే చంపేసాడు. ఒంగోలుకు చెందిన‌ రాజేష్ అనే వ్య‌క్తి అస్సాంలోని శివసాగర్‌లో ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్, లెక్చరర్‌గా పని చేస్తున్నారు. 11వ తరగతి విద్యార్థికి కెమిస్ట్రీలో తక్కువ మార్కులు వచ్చాయని ప్రవర్తన కూడా బాలేదని రాజేష్ మందలించారు. దీంతో ఆ విద్యార్థి కక్ష పెంచుకొని.. ఆయన క్లాసు చెబుతున్న సమయంలో ఆ విద్యార్థి కత్తితో రాజేశ్ పై దాడికి పాల్ప‌డ్డాడు. రాజేష్‌ను హాస్పిట‌ల్‌కు తరలిస్తుండగా తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో మార్గమధ్యలో మరణించారు.