హైద‌రాబాద్‌లో న‌డిరోడ్డుపై దారుణ హ‌త్య‌

Hyderabad: హైద‌రాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ప‌ట్ట‌ప‌గ‌లే దారుణ హ‌త్య‌కు ఒడిగ‌ట్టారు. గుడిమల్కాపూర్‌లో రోడ్డు పక్కన వ్యాపారం చేసే సనావుల్లా(24) దగ్గరకు వచ్చిన ఇద్దరు దుండగులు మొబైల్‌ ఇవ్వాలని అడగగా, తాను ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో దుండగులు లాక్కునేందుకు ప్రయత్నించగా, ప్రతిఘటించిన సనావుల్లాను కత్తితో ఛాతీపై పొడిచి మొబైల్ లాక్కొని పరారయ్యారు. గమనించిన పోలీసులు సనావుల్లాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే అత‌ను మృతి చెందాడని వైద్యులు తెలిపారు.