VK Naresh: ఐప్యాక్ స‌ర్వే ప్ర‌కారం వారి ఓట్లు కూట‌మికే

VK Naresh: ఈ ఏడాది చాలా మంది యువ‌త మేజ‌ర్లు కాబోతున్నార‌ని వారి ఓట్లు కూట‌మికే ప‌డ‌నున్నాయని ఐప్యాక్ స‌ర్వే చెప్తోంద‌ని అన్నారు సీనియ‌ర్ న‌టుడు వీకే న‌రేష్‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల గురించి ఎప్ప‌టికప్పుడు త‌న అభిప్రాయాల‌ను ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేస్తున్నారు న‌రేష్‌. ఐప్యాక్ స‌ర్వే ప్ర‌కారం ఈ ఏడాది మేజ‌ర్ కాబోతున్న యువ‌త‌లో 22% మంది మాత్ర‌మే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయ‌నున్నార‌ని.. మిగ‌తా 78% మంది కూట‌మికే ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నార‌ని తెలిపారు. ఈ యువ‌త గ‌తేడాది వ‌ర‌కు మైన‌ర్‌గా ఉండి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ప్ర‌చారం చేసార‌ని.. ఇప్పుడు వారు మేజ‌ర్ అయ్యారు కాబ‌ట్టి కూట‌మికే ఓట్లు గుద్ది రివెంజ్ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నార‌ని పేర్కొన్నారు.