YS Sunitha Reddy: అవినాష్ పిల్లాడైతే స్కూల్‌కి పంపు

YS Sunitha Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హ‌త్య కేసులో ప్ర‌ధాన అనుమానితుడైన వైఎస్ అవినాష్ రెడ్డికి (YS Avinash Reddy) ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చార‌ని మ‌రోసారి ప్ర‌శ్నించారు వివేకా కుమార్తె వైఎస్ సునితా న‌ర్రెడ్డి. ఈరోజు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) పులివెందుల‌లో నామినేష‌న్ వేసాక ప్ర‌జ‌ల మ‌ధ్య ప్ర‌సంగించారు. నామినేష‌న్ స‌మ‌యంలో క‌డ‌ప ఎంపీగా బ‌రిలోకి దిగుతున్న అవినాష్ రెడ్డి కూడా జ‌గ‌న్‌తో పాటే ఉన్నాడు.

అయితే జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ.. వివేకా హ‌త్య గురించి ప్ర‌స్తావించారు. బాబాయిని చంపింది ఎవ‌రో ఏపీ ప్ర‌జ‌ల‌కు కూడా తెలుస‌ని కానీ చిన్న పిల్లాడైన అవినాష్ రెడ్డిని ఇరికించి అత‌నికి రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేకుండా చేస్తున్నార‌ని ష‌ర్మిళ‌, సునీత‌ల‌పై జ‌గ‌న్ మండిప‌డ్డారు. దీనిపై సునీత స్పందించారు. అవినాష్ చిన్న పిల్లాడైన‌ప్పుడు అంత చిన్న‌పిల్లాడికి ఎంపీ స్థాయి టికెట్ ఎందుకు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. ఎంపీ టికెట్ అంతే బాగా అనుభ‌వం ఉన్న‌వారికి నేర చ‌రిత్ర లేనివారికి ఇవ్వాల‌ని చిన్న పిల్లాడైన అవినాష్‌కు ఇవ్వ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ త‌ర‌ఫున క‌డ‌ప నుంచి బ‌రిలోకి దిగుతున్న త‌న అక్క వైఎస్ ష‌ర్మిళ‌కే ఓటు వేసి గెలిపించాల‌ని మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు రిక్వెస్ట్ చేసారు.