వేలు న‌రుక్కుని జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా మ‌హిళ‌ నిర‌స‌న‌..!

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌న‌కు జ‌రిగిన అన్యాయాల గురించి చెప్పుకుంటే ఎవ్వరూ ప‌ట్టించుకోవ‌డం లేదు అనుకుందో ఏమో.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చేస్తున్న అక్ర‌మాల గురించి ఏకంగా దేశ రాజ‌ధాని ఢిల్లీకి వెళ్లి మ‌రీ నిర‌స‌న వ్య‌క్తం చేసింది ల‌క్ష్మీ అనే బాధితురాలు. బాధితురాలు కోపూరి ల‌క్ష్మి.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌న కుటుంబానికి చేసిన అన్యాయాన్ని సీబీఐకి వివ‌రించాల‌ని ఢిల్లీకి వెళ్లింది. అధికారుల‌కు క‌ల‌వ‌డం సాధ్యం కాక‌పోవడంతో త‌న బొట‌న వేలు న‌రుక్కుని ఆ వీడియోను బ‌య‌ట‌పెట్టి అంద‌రినీ షాక్‌కి గ‌రిచేసింది.

ఆద‌ర్శ మ‌హిళా మండ‌లి అధ్య‌క్షురాలిగా ఉన్న కోపూరి ల‌క్ష్మి.. ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఓ ముఠా చిన్న‌పిల్ల‌ల‌కు గంజాయి అల‌వాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విష‌య‌మై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా వారు ప‌ట్టించుకోలేద‌ని.. ప్ర‌శ్నిస్తే త‌మ‌పై కేసులు వేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని అన్నారు. ఆమె వేలు న‌రుక్కోవ‌డం దేశ రాజ‌ధానిలో సంచ‌ల‌నం సృష్టించింది. వెంట‌నే ఆమెను చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్టేందుకు త‌న‌కు మ‌రో దారి దొర‌క‌లేద‌ని.. అందుకే వేలు న‌రుక్కున్నాన‌ని కోపూరి ల‌క్ష్మి వాపోయారు.

ALSO READ:

Jagan: రుణ‌మాఫీ చేద్దామా?

Pawan Kalyan: నా నాలుగో పెళ్లాంని అవ‌మానించార‌ట‌!