Viral News: ఇన్‌స్టాలో పరిచయం.. మైన‌ర్‌తో ప్రేమ పెళ్లి చావు

Viral News: ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మైన‌ర్‌తో ప‌రిచ‌యం పెంచుకుని.. ఆమెతో ప్రేమ‌లో పడి.. పెళ్లి చేసుకుని.. చివ‌రికి త‌నువు చాలించాడు పై ఫోటోలో క‌నిపిస్తున్న యువ‌కుడు. ఈ ఘ‌టన రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు మండ‌లంలో చోటుచేసుకుంది.
ఉత్తరాసపల్లికి చెందిన శ్రీకాంత్‌(24)కు.. ఇన్‌స్టాగ్రామ్‌లో బండ్లగూడ జాగీర్‌ కిస్మత్‌పురకు చెందిన పదో తరగతి చదువుతున్న ఓ బాలిక(16)తో పరిచయమైంది.

బాలిక మైనర్‌ కావడంతో ఇరు కుటుంబాలు ఒప్పుకోవని గతనెల 27న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు.. తరువాత శ్రీకాంత్‌ తన గ్రామానికి ఆ బాలికని తీసుకురాగా, గ్రామస్థులు మైనర్‌ను పెళ్లి చేసుకున్నందుకు పోలీసు కేసు అవుతుందని, ఆ బాలికని వాళ్ల ఇంటి దగ్గర వదిలిపెట్టమని అన్నారు.

దాంతో కేసులకు భయపడి, కలిసి ఉండలేమని భావించి శ్రీకాంత్‌, ఆ బాలిక మార్చి 30న పురుగుల మందు తాగారు. వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి బాలిక మృతి చెందగా, నిన్న ఉదయం శ్రీకాంత్‌ చనిపోయాడు.