Yatra 2: “ప‌వ‌న్ ఉండ‌రు.. మీరే డైరెక్ట్ చేసేయండి”

Yatra 2: మ‌హి వి రాఘ‌వ్ (mahi v raghav) డైరెక్ట్ చేసిన యాత్ర 2 సినిమా గురించి ఆస‌క్తిక‌ర అంశం వైరల్ అవుతోంది. ఏపీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) 2019 స‌మ‌యంలో చేసిన పాద‌యాత్ర నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ‌ను చూపించ‌బోతున్నారు మ‌హి. అయితే ఈ సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (pawan kalyan), నారా లోకేష్‌ (nara lokesh), వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) పాత్ర‌ల‌కు సంబంధించి ఎలాంటి స‌న్నివేశాలు ఉండ‌వ‌ని ఒక టాక్ న‌డుస్తోంది. ఇదే అంశంపై ఓ మీడియా వ‌ర్గం ట్వీట్ చేయ‌డంతో మ‌హి రిప్లై ఇచ్చారు. ఇక సినిమా క‌థ మొత్తం మీకు తెలిసిన‌ప్పుడు మీరే డైరెక్ట్ చేయొచ్చు క‌దా. నేనెందుకు. స‌మాచారం ఇవ్వ‌డంతో త‌ప్పుడు స‌మాచారం ఇవ్వ‌డంలో చాలా తేడా ఉంటుంద‌ని మీడియా వ‌ర్గాలు గుర్తుంచుకోవాలి అని మండిప‌డ్డారు.

సినిమాపై ఆస‌క్తి పెంచేందుకు మ‌హి ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు కానీ నిజానికి సినిమా మొత్తం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల చుట్టూనే తిరుగుతుంద‌ని, అక్క‌డ‌క్క‌డా చంద్ర‌బాబు నాయుడు స‌న్నివేశాలు ఉంటాయి కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వైఎస్ ష‌ర్మిళ‌, నారా లోకేష్‌ల‌కు సంబంధించి ఎలాంటి అంశాలు చూపించ‌డంలేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. వారు ముగ్గురూ లేన‌ప్పుడు ఇక సినిమాలో మ‌జా ఏముంటుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.