Covid: 24 గంటల్లో కొత్తగా 692 కేసులు.. 6 మృతి

Covid: దేశంలో క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోంది. గ‌డిచిన గత 24 గంటల్లో కొత్తగా 692 కరోనా కేసులు నమోదు కాగా, 6 మంది మృతిచెందారు. ఇప్పుడు దేశంలో 4097 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. క‌ర్ణాట‌క‌, కేర‌ళ, తెలంగాణ‌ రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు న‌మోదవుతున్నాయి. మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.